నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమరావతి: నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 20న ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిం చనున్నట్లు నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ డిప్యూటీ కమిషనర్ టి.గోపాలకృష్ణ తెలిపారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వివరించారు. శనివారం ఉదయం 11.30 గంటలకు పరీక్ష ప్రారంభమవుతుందని, ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష రాసేందుకు అనుమతి ఉండదని చెప్పారు. ఈ పరీక్షకు ఏపీ నుంచి 91,041 మంది, తెలంగాణ నుంచి 50,332 మంది, పాండిచేరిలోని యానాం నుంచి 395 మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. ఏపీలో 416, తెలంగాణలో 244, యానాంలో 2 పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. హాల్ టికెట్లను https://navodaya.gov.in/nvs/en/Home1 35 0 చేసుకోవాలని, హాల్ టికెట్ రానివారు సమీప నవోదయ విద్యాలయంలో సంప్రదించాలని డిప్యూటీ కమిషనర్ గోపాలకృష్ణ 'సాక్షి'కి తెలిపారు.
Please Comment ......Thank You