అమరావతి :
తల్లికి వందనం పథకాన్ని జూన్ నెలలోనే ప్రారంభించాలని కూటమి ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
తాజాగా ఈ పథకంపై మరో బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.15,000 నగదు జమ చేయనుంది.
అయితే, ఈ మొత్తం పొందాలంటే విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాను ఆధార్ నంబర్తోపాటు ఎన్పీసీఐతో జూన్ 5 లోపు లింక్ చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
ఇందు కోసం పోస్టల్, సచివాలయ సిబ్బంది, బ్యాంకు అధికారులను సంప్రదించాలి.
Please Comment ......Thank You